తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టు ఆదేశాల‌పై పవన్ కళ్యాణ్ ఏమ‌న్నారంటే..

తిరుమల లడ్డూ వివాదం విష‌య‌మై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

By Medi Samrat  Published on  5 Oct 2024 12:54 AM GMT
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీం కోర్టు ఆదేశాల‌పై పవన్ కళ్యాణ్ ఏమ‌న్నారంటే..

తిరుమల లడ్డూ వివాదం విష‌య‌మై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుందన్నారు.

తిరుమల లడ్డూ తయారీల్లో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడైనప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారన్నారు. గత పాలకులు నియమించిన టీటీడీ బోర్డుల హయాంలో లడ్డూ ప్రసాదం కావచ్చు., స్వామివారికి చేసే కైంకర్యాలు కావచ్చు., అన్న ప్రసాదం కావచ్చు.. అన్నిటా నాణ్యత ప్రమాణాలు లోపించాయనే భక్తులు ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పవిత్ర క్షేత్రం తిరుమలలో గత పాలక మండళ్ళు చేసిన నిర్ణయాలు, వారి పాలన తీరును - సమగ్రంగా సమీక్షించి, సంస్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పుడు నిర్ణయాలకు, అపవిత్ర చర్యలకు కారకులైన వారిని నిబంధనల ప్రకారం బాధ్యులను చేస్తామన్నారు.

Next Story