నిన్న పెళ్లి.. నేడు వివాదంలో నయనతార
Nayanthara in Controversy after walked with chappals in tirumal maada veedhi. హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ శివన్లు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
By Medi Samrat Published on
10 Jun 2022 1:58 PM GMT

హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ శివన్లు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన దంపతులు తొలిసారిగా ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు వీఐపీ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ కొత్త జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు.
నయనతార ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్తతో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే నడిచారు. నయనతార చెప్పులు ధరించడం వివాదాస్పదమయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story