అమిత్ షా పర్యటన.. తిరుమలలో ముమ్మర తనిఖీలు

తిరుమలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు

By Medi Samrat  Published on  30 May 2024 3:30 PM IST
అమిత్ షా పర్యటన.. తిరుమలలో ముమ్మర తనిఖీలు

తిరుమలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం మొదలుకొని ఆలయ నాలుగు మాడ వీధులు, అఖిలాండం, రాంభగీచా అతిధి గృహం వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ఘాట్ రోడ్డు, రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

అమిత్‌షా నేడు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటారు. రాత్రి తిరుమలలోని వకుళామాత అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం శ్రీవారి సేవలో పాల్గొని మధ్యాహ్నం తిరుగు ప్రయాణమవుతారు.

Next Story