తిరుపతికి సమీపంలో భూప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే
Earthquake of magnitude 3.6 strikes near Tirupati.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 3 April 2022 3:02 AM GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 1.10గంటల సమయంలో తిరుపతికి సమీపంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.6గా నమోదు అయినట్లు చెప్పింది. భూ కంప కేంద్రం తిరుపతికి ఈ శాన్య దిశలో 85 కిలో మీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అర్థరాత్రి సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఎలాంటి సమాచారం అందలేని అధికారులు తెలిపారు.
Earthquake of Magnitude:3.6, Occurred on 03-04-2022, 01:10:29 IST, Lat: 14.24 & Long: 79.90, Depth: 20 Km ,Location: 85km NE of Tirupati, Andhra Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/QSzi22cneF @ndmaindia @Indiametdept pic.twitter.com/P9RcXBkWi6
— National Center for Seismology (@NCS_Earthquake) April 2, 2022