టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ నియామకం

Dasari Kiran Kumar Appointed TTD Board Member. టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది.

By -  Medi Samrat
Published on : 16 Dec 2022 8:02 PM IST

టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ నియామకం

టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ గా పూర్తి అదనపు భాద్యతలను నిర్వహిస్తున్న ఎం. హరి జవహర్ లాల్ జీఓ జారీ చేశారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్ (పిల్) సంఖ్య. 203/2021 ఫలితానికి లోబడి ఈ నియామకం జరిగినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. టీటీడీ బోర్డుకి ఇప్పటికే 23 మంది సభ్యులుండ‌గా.. ఇప్పుడు 24వ సభ్యుడిగా దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ ప్ర‌భుత్వం కీల‌క‌ ఉత్తర్వులు జారీ చేసింది. సినీ పరిశ్రమ నుంచి గ‌తంలో చాలామందికి ఈ పదవి లభించింది. దాస‌రి కిర‌ణ్ కుమార్ టాలీవుడ్‌లో పేరున్న నిర్మాత‌. ఆయ‌న నిర్మాత‌గా ప‌లు సినిమాలు నిర్మించారు. రామ్‌లీల‌, సిద్ధార్థ‌, జీనియ‌స్‌, వంగ‌వీటి, వ‌స్తా.. నీవెన‌క వంటి చిత్రాల‌ను నిర్మించారు.


Next Story