ప్రతీకారం తీర్చుకున్న భద్రతా దళాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 1:47 AM GMT
ప్రతీకారం తీర్చుకున్న భద్రతా దళాలు

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమ‌వారం ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు స‌హా ఓ పోలీసు ఉన్న‌తాధికారి మ‌ర‌ణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ఉగ్ర‌దాడిలో గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించామని అన్నారు. గత వారం రోజుల్లో భద్రతా దళాలపై మూడు సార్లు దాడి జరిగాయి. దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

అధికారులు అప్రమత్తమై తీవ్రవాదులను వేటాడడం మొదలుపెట్టారు. తాజాగా బారాముల్లా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఓ లష్కరే తోయిబా కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకుంది సీఆర్‌పీఎఫ్‌, జమ్ము కశ్మీర్‌ పోలీసులతో కూడిన సంయుక్త బృందం. అక్కడే దాక్కుని ఉన్న లష్కరే కమాండర్‌ సాజద్‌ అలియాస్‌ హైదర్‌ సహా మరో లష్కరే ఉగ్రవాదిని ఎన్ కౌంటర్ చేశారు. బారాముల్లాలో భద్రతా బలగాల మీద జరిగిన దాడికి ఇది ప్రతీకారంగా భావిస్తున్నారు.

ఉత్తర కశ్మీర్‌లో చురకుకుగా పనిచేసే ఉగ్రవాది సాజిద్‌.. టాప్‌ 10 ఉగ్రవాదుల్లో అతడు కూడా‌ ఒకడని అధికారులు తెలిపారు. అనతుల్లా మిర్‌ అనే మరో ఉగ‍్రవాదిని మట్టుబెట్టామని అధికారులు వెల్లడించారు.

Next Story