రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల విమర్శల బాణాలు

YS Sharmila criticizes Revanth Reddy. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on  6 March 2023 3:30 PM GMT
రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల విమర్శల బాణాలు

YS Sharmila


పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అని రేవంత్ రెడ్డి అన్నారని షర్మిల గుర్తు చేశారు. YSR గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

"‘మహానేత YSR పాలన తెస్తా’ అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు YSR గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరు. ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు YSR అభిమానులే బుద్ధి చెప్తారు. YSR సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. ఆ మహానేత ఆశయ సాధన కోసం 3800 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది YSR బిడ్డ మాత్రమే." అని ట్వీట్ చేశారు షర్మిల.


Next Story