Video: కేబినెట్‌లో మాకు చోటేదీ.. గాంధీభవన్‌లో గొర్రెలతో యాదవుల నిరసన

తెలంగాణ కేబినెట్‌లో స్థానం కల్పించాలని కోరుతూ యాదవులు వినూత్న నిరసన చేపట్టారు.

By Knakam Karthik
Published on : 23 Jun 2025 10:47 AM IST

Telangana, Hyderabad, GandhiBhavan, Congress Government, Cabinet, Yadavs

Video: కేబినెట్‌లో మాకు చోటేదీ..గాంధీభవన్‌లో గొర్రెలతో యాదవుల నిరసన

తెలంగాణ కేబినెట్‌లో స్థానం కల్పించాలని కోరుతూ యాదవులు వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లోకి గొర్లను పంపించి గొర్ల కాపరుల సంక్షేమ సంఘం నిరసన తెలియజేసింది. కేబినెట్‌లో యాదవులకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అలాగే పీసీసీ కార్యవర్గంలోనూ యాదవ్‌లకు ప్రాధాన్యత తగ్గిందని ఆరోపించారు. పీసీసీ కార్యవర్గంలో యాదవ్‌లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని గొర్ల కాపరుల సంఘం డిమాండ్ చేసింది.

అయితే ఇటీవలే కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ విస్తరణ చేపట్టింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇద్దరు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి, ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరిలో గడ్డం వివేక్ మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా, అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు. ఇక వెనకబడిన తరగతులకు చెందిన అడ్లూరి లక్ష్మణ్ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు. ఈ నేపథ్యంలోనే యాదవులకు కూడా మంత్రివర్గంలో బెర్త్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story