రెండు రాష్ట్రాల పోలీసుల కళ్లల్లో కారం కొట్టిన తెలంగాణ మహిళ.. ఎందుకు అలా చేసిందంటే..

Woman attacks cops with chilli powder to help murder accused husband escape. తెలంగాణలోని అత్తాపూర్‌లో ఉత్తరాఖండ్ ఎస్‌టిఎఫ్ పోలీసులు

By Medi Samrat  Published on  24 Dec 2021 4:17 AM GMT
రెండు రాష్ట్రాల పోలీసుల కళ్లల్లో కారం కొట్టిన తెలంగాణ మహిళ.. ఎందుకు అలా చేసిందంటే..

తెలంగాణలోని అత్తాపూర్‌లో ఉత్తరాఖండ్ ఎస్‌టిఎఫ్ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసు బృందంపై ఓ మహిళ కారం కొట్టింది. అయితే ఆమె ఈ పని చేయడానికి ముఖ్య కారణం తన భర్త అరెస్టును తప్పించడానికే..! హత్య కేసులో నిందితుడి భార్య కారంపొడితో పోలీసులపై దాడి చేసింది. నివేదికల ప్రకారం, తన భర్త తప్పించుకోవడానికి ఆ మహిళ ఈ పని చేసింది. షమీమ్ పర్వీన్ అనే మహిళపై ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని బుధవారం విడిచిపెట్టినట్లు నివేదికలు తెలిపాయి.

2019 హత్య కేసులో మహిళ భర్త వసీమ్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు వెతుకుతున్నారని తేలింది. దంపతులు అత్తాపూర్‌లోని సులేమాన్ నగర్‌లో స్థిరపడ్డారని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ పోలీసుల బృందం వసీం ఇంటికి వెళ్లింది. వారితో పాటు రాజేంద్రనగర్ పీఎస్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. ఇంతలో, మహిళ పోలీసులను చూసిన వెంటనే, వెంటనే స్పందించి, ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ చమన్ కుమార్ , స్థానిక కానిస్టేబుల్‌పై కారం పొడి విసిరింది. ఆమె బూతులు మాట్లాడడమే కాకుండా, గట్టిగా అరుస్తూ పోలీసులు తనను వేధిస్తున్నారని చెప్పడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. ఈ గొడవల మధ్య నిందితుడు వసీం ఇంటి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులను అడ్డుకున్నందుకు ఆ మహిళపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.


Next Story