టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శనివారం 2017 చెల్లింపు సవరణ కమిషన్ (PRC)ని 21 శాతం ఫిట్‌మెంట్‌తో ఏప్రిల్ 1, 2024 నుండి అమలు చేయాలని నిర్ణయించింది

By Medi Samrat  Published on  9 March 2024 2:00 PM GMT
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శనివారం 2017 చెల్లింపు సవరణ కమిషన్ (PRC)ని 21 శాతం ఫిట్‌మెంట్‌తో ఏప్రిల్ 1, 2024 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్‌ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. TSRTC సిబ్బంది 2017 PRC, 2021 PRC ప్రకారం తమ వేతనాన్ని సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. TSRTCలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నెలవారీ వేతనాలను సర్దుబాటు చేయడం సర్వసాధారణం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16 శాతం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 21 శాతం పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడనుంది. PRC అమలు వల్ల 53,071 మంది ఉద్యోగులకు మేలు కలగనుంది.

Next Story