13 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది.. మంచిగా ఉపయోగించుకొండి

గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

By Medi Samrat  Published on  21 Oct 2024 9:06 AM GMT
13 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది.. మంచిగా ఉపయోగించుకొండి

గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామ‌ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయం అన్నారు. ప్రభుత్వం తెలంగాణ యువతకు మంచి ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో విద్యార్థులు హ్యాపీగా పరీక్షలు రాసుకోవాల‌ని సూచించారు.

13 ఏళ్ల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది.. మంచిగా ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నామ‌న్నారు. మేము మొదటి నుంచి గ్రూప్-1 విద్యార్థులకు అండగా ఉన్నాం.. ఇదే విషయాన్ని పదే పదే చెపుతూనే ఉన్నాం. జీఓ 29 వల్ల రిజర్వేషన్లు అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి చెప్తున్న.. నేను బీసీ బిడ్డగా విద్యార్థులకు భరోసా ఇస్తున్న.. రిజర్వేషన్లల‌లో ఎలాంటి అన్యాయం జరగదన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం గ్రూప్-1 విద్యార్థులను పావుగా వాడుకున్నాయన్నారు. మీరు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి.. భవిష్యత్ బాగుచేసుకొవాలని ఆకాంక్షిస్తున్న.. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు.. అభినందనలు తెలిపారు.

Next Story