తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణలో మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
By అంజి Published on 11 April 2024 8:25 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణలో మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. ఇదిలా ఉంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
అటూ వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ యొక్క అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నేడు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ (NCAP), యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ (SCAP), రాయలసీమలోని వివిక్త ప్రాంతాలలో వేడి, తేమ,అసౌకర్య వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. .
ఏప్రిల్ 12 నుండి, ఇదే ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ తుఫాను పరిస్థితులు ఏప్రిల్ 12 నుండి 14 వరకు తదుపరి మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. గత రెండు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల సెల్సియస్ తగ్గుముఖం పట్టగా, రాయలసీమ జిల్లాల్లో ఉక్కపోత కొనసాగుతోంది.
అనంతపురంలో అత్యధికంగా 40.3 డిగ్రీల సెల్సియస్, నంద్యాలలో 40 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా విశాఖపట్నంలో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను వడగాలులు తాకడంతో వాతావరణ సలహా వచ్చింది. 11 మండలాలకు తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ చేయగా, 134 మండలాల్లో వడగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.