రేపటితో రైతు భరోసా పూర్తి..విజయోత్సవ సంబరాలకు ప్రభుత్వం నిర్ణయం

రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

By Knakam Karthik
Published on : 23 Jun 2025 1:26 PM IST

Telangana, Congress Government, Raithu Bharosa, Farmers

రేపటితో రైతు భరోసా పూర్తి..విజయోత్సవ సంబరాలకు ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద అందిస్తోన్న రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గాంధీభవన్‌లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. ఇప్పటివరకు 1.49 కోట్ల ఎకరాలకు రూ.8284 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేశాం. రేపటితో రైతు భరోసా పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలన నిర్ణయం తీసుకున్నట్లు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

Next Story