తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద అందిస్తోన్న రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గాంధీభవన్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. ఇప్పటివరకు 1.49 కోట్ల ఎకరాలకు రూ.8284 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేశాం. రేపటితో రైతు భరోసా పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలన నిర్ణయం తీసుకున్నట్లు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.