ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన గొడవ.. కారుతో ఢీకొట్టే దాకా..!

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో థార్ వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

By Medi Samrat
Published on : 3 Jun 2025 7:45 PM IST

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన గొడవ.. కారుతో ఢీకొట్టే దాకా..!

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో థార్ వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో ఓ గొడవ జరిగిందని, ఆ తర్వాత నిందితుడు బాధితుడిని వాహనంతో ఢీకొట్టడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది.

బాధితుడు రోడ్డుపై నుంచి కాలువలో పడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే యాక్షన్ లోకి దిగారు. అధికారులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

ఆన్‌లైన్ లో మొదలైన గొడవ ఈ హింసాత్మక చర్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇద్దరు నెటిజన్ల మధ్య మాటల యుద్ధం జరిగిందని, వారు ఒకరికొకరు తెలిసిన వాళ్లే కావడంతో ఓ వ్యక్తి కోపం పట్టలేక యాక్సిడెంట్ చేశాడు.

Next Story