సంక్రాంతి వేళ రైతులకు గుడ్‌న్యూస్‌.. వరి ధాన్యం బోనస్‌ డబ్బుల విడుదల

సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్‌ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది.

By -  అంజి
Published on : 13 Jan 2026 7:03 AM IST

Telangana, paddy bonus, farmers, Telangana Govt

సంక్రాంతి వేళ రైతులకు గుడ్‌న్యూస్‌.. వరి ధాన్యం బోనస్‌ డబ్బుల విడుదల

హైదరాబాద్: సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్‌ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. ఖరీఫ్‌ సీజన్‌ బోనస్‌ డబ్బులను రిలీజ్‌ చేసింది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రూ.1425.91 కోట్ల బోనస్‌ డబ్బులు రిలీజ్‌ చేసినట్టు పేర్కొంది. నిధుల విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ మంగళవారం వరి బోనస్ పథకంలో భాగంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ₹500 కోట్లను నేరుగా విడుదల చేసింది. తాజా విడతతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ₹500 వరి బోనస్ పథకం కింద మొత్తం పంపిణీ ₹1,425.91 కోట్లకు చేరుకుందని అధికారులు తెలిపారు. బోనస్ కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా చెల్లించబడుతుంది, దీని వలన రైతులకు వరి క్వింటాలుకు ₹2,889 లభిస్తుంది. ఇందులో MSP, బోనస్ కలిసి ఉంటాయి.

Next Story