బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదు..కవిత లేఖనే ఆధారం: పొన్నం

బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, దానికి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖనే ఆధారం..అని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

By Knakam Karthik
Published on : 23 May 2025 1:47 PM IST

Telangana, Minister Ponnam Prabhakar, Congress Government, Mlc Kavitha, Brs

బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదు..కవిత లేఖనే ఆధారం: పొన్నం

బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, దానికి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖనే ఆధారం..అని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్‌కు బీజేపీతో లోపాయికార ఒప్పందం ఉంది. దీనికి బీజేపీ నాయకత్వం కూడా సమాధానం చెప్పాలి. మొన్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే.. బీఆర్ఎస్ మద్దతు ఇస్తామని చెప్పారు. బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు.. బీఆర్ఎస్‌లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు అలాంటి అవకాశం ఇవ్వలేదు. వారి రహస్య ఒప్పందం అమలు జరగలేదు. ఇది ఆ ఒక్కరోజే కాదు పార్లమెంట్ ఎన్నికల్లో చేతులెత్తేసిన పార్టీని బీజేపీకి సరెండర్ చేశారు. ఆరోజు మేం మాట్లాడితే రాజకీయ విమర్శలు అన్నారు..అని పొన్నం వ్యాఖ్యానించారు.

బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ అగ్రిమెంట్ ప్రకారం, కేసీఆర్ సూచన మేరకే కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యారు. కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రతిపాదించిన అధ్యక్షుడు కాదా? దేశ బడ్జెట్‌లో తెలంగాణకు రూపాయి ఇవ్వకపోతే, విభజన హామీలు అమలు కాక, సీలేరు ప్రాజెక్టు ఎత్తుకుపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. దానినీ డైవర్షన్ చేయడానికి కేటీఆర్ చిట్ చాట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక పై ఈడి పేరుతో వేధింపులు జరుపుతున్న కేసు. ఇది బీజేపీ వేధింపు కార్యక్రమం. ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ,సోనియా గాంధీ రాహుల్ గాంధీలు సంపాదించుకోవాలనుకుంటే లెక్క కాదు 50 మంది ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులను చేసిన ఘనత.. వారు సంపాదించుకోవాలి అనుకుంటే ఎంత..? ఇలాంటి వేధింపులు సరైంది కాదు. కేటీఆర్ బీజేపీ డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి పై మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కూలిన నాడు మీరే అధికారంలో ఉన్నారు..కాళేశ్వరం బాంబు పెట్టారేమో అని కమిషన్ వేశారు. నేను కాళేశ్వరం విజిట్ చేశా. కాంగ్రెస్ పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం ముందు నుండి ఉంది. 2023లో మిమల్ని మట్టి కరిపించింది చూశారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉందనడం అపోహ..అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Next Story