రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్‌.. సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన మహిళలకు రూ.500 ధరతో సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్లు, నెలవారీ రూ.2500 ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవుతోంది.

By అంజి  Published on  23 Jan 2024 4:12 AM GMT
Telangana govt, LPG cylinders, Hyderabad, CM Revanth Reddy

రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్‌.. సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్‌!

హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అర్హులైన మహిళలకు రూ.500 ధరతో సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్లు, నెలవారీ రూ.2500 ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. మూలాల ప్రకారం.. ఇటీవల దావోస్, లండన్, దుబాయ్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి, మహా లక్ష్మి హామీలో భాగమైన రెండు పథకాల అమలును ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

డిసెంబరు 28 నుండి జనవరి 6 వరకు ఇటీవల ముగిసిన ప్రజాపాలన కార్యక్రమంలో, మొత్తం 91.49 లక్షల మంది మహిళలు రూ. 500 ధర కలిగిన సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదనంగా, కార్యక్రమంలో, 92.23 లక్షల మంది మహిళలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సబ్సిడీ గ్యాస్, ఆర్థిక సహాయం పథకాలకు ఇతర హామీలతో పోల్చితే అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ప్రకటనకు ముందే మహాలక్ష్మి పథకంలోని రెండు భాగాలను అమలు చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

తెలంగాణలో మహాలక్ష్మి పథకం

తెలంగాణాలో కాంగ్రెస్ వాగ్దానం చేసిన మహాలక్ష్మి పథకం, మహిళలకు నెలకు రూ.2500 అందించడం, రూ.500కే ఎల్‌పిజి సిలిండర్లు అందించడం, టిఎస్‌ఆర్‌టిసిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. టిఎస్‌ఆర్‌టిసిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, రాష్ట్రంలో రూ.500లకే ఆర్థిక సాయం, ఎల్‌పిజి సిలిండర్లు అందజేస్తామన్న హామీ అమలు పెండింగ్‌లో ఉంది. ఎంసీసీ ప్రకటనకు ముందే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో రూ.500 ఎల్‌పీజీ సిలిండర్లు, ఆర్థిక సాయం అందించే పథకాలను ప్రభుత్వం చేపడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Next Story