Telangana : 21న కాదు 22వ తేదీ సెల‌వు.. మార్పు గమనించండి..!

తెలంగాణ ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం 21వ తేదీన హజ్రత్ అలీ షహాదత్‌ను గుర్తుచేసుకుంటూ సెలవు దినంగా ప్రకటించింది.

By Medi Samrat  Published on  19 March 2025 6:38 PM IST
Telangana : 21న కాదు 22వ తేదీ సెల‌వు.. మార్పు గమనించండి..!

తెలంగాణ ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం 21వ తేదీన హజ్రత్ అలీ షహాదత్‌ను గుర్తుచేసుకుంటూ సెలవు దినంగా ప్రకటించింది. తెలంగాణ క్యాలెండర్ మార్చి 21న సెలవు దినంగా పేర్కొన్నప్పటికీ, దానిని మార్చి 22న పాటించనున్నారు. రంజాన్ నెలకు సంబంధించి చంద్రవంక కనిపించడం ఆలస్యం అవ్వడం వల్ల తేదీ మార్పు జరిగింది. దీని ఫలితంగా మార్చి 2న రంజాన్ మాసం ప్రారంభమైంది.

ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ, అది ఐచ్ఛికం, సాధారణమైనది కాదు. సెలవు దృష్ట్యా, పాఠశాలలు, ఇతర కళాశాలలు, ముఖ్యంగా మైనారిటీ సంస్థలు సెలవు ప్రకటించవచ్చు. ఇక ఈద్-ఉల్-ఫితర్ పండుగకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది. మార్చి 31న ‘ఈద్-ఉల్-ఫితర్’ వచ్చింది. పండుగలు నెలవంక దర్శనం ఆధారంగా మారుతాయి కాబట్టి ప్రభుత్వం ఈద్-ఉల్-ఫితర్ సెలవులను మార్చవచ్చు. మార్చి 30న నెలవంక దర్శనమైతే, ఈద్‌ను మార్చి 31న జరుపుకుంటారు. లేకుంటే ఏప్రిల్ 1న రంజాన్ పండుగను జరుపుకోనున్నారు.

Next Story