పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Telangana Govt committed for Police welfare. తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు.

By Medi Samrat
Published on : 21 Oct 2022 3:51 PM IST

పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పోలీసు సిబ్బందిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో వేర్వేరు ఘటనల్లో మృతి చెందిన ఏడుగురు పోలీసు అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. తెలంగాణ శాంతియుతంగా ఉండేందుకు పోలీసులు కీలకపాత్ర పోషించారని మంత్రి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల కోసం ఆరు ఎకరాల్లో రూ.11 కోట్లతో అల్ట్రా మోడ్రన్ కన్వెన్షన్ హాల్‌ను నిర్మించిందని హరీశ్ రావు తెలిపారు. కన్వెన్షన్ సెంటర్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సిద్దిపేటలో పోలీసు సంక్షేమానికి ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల త్యాగాలను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


Next Story