రంజాన్ పండుగ వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఉ.5 వరకు ఓపెన్
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యాపారులకు, ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది
By - Knakam Karthik |
రంజాన్ పండుగ వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఉ.5 వరకు ఓపెన్
హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యాపారులకు, ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 19 నుండి మార్చి 20, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార సంస్థలను తెల్లవారుజామున 5 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు కార్మిక శాఖ అనుమతినిచ్చింది. కార్మిక కమిషనర్ ఎం. దాన కిషోర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా సెహ్రీ సమయం వరకు పౌరులకు షాపింగ్, భోజన వసతులు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ వెసులుబాటుతో హైదరాబాద్లోని పాతబస్తీ, చార్మినార్, లాడ్ బజార్ వంటి ప్రాంతాలు పండుగ శోభతో "రాత్రి బజార్లు"గా మారనున్నాయి. పగటిపూట ఉపవాసం ఉండే పౌరులు రాత్రి సమయాల్లో ప్రశాంతంగా షాపింగ్ చేసుకునేందుకు, హలీమ్, ఇరానీ చాయ్ వంటి రుచులను ఆస్వాదించేందుకు ఇది దోహదపడుతుంది. చిన్న వ్యాపారులకు ఈ నెల రోజుల సమయం ఆర్థికంగా ఎంతో కీలకం కానుంది.
అయితే, పని గంటల పొడిగింపు నేపథ్యంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఓవర్ టైం చేసే ఉద్యోగులకు సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలని, 13 గంటల 'స్ప్రెడ్-ఓవర్' పరిమితిని మించకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల భద్రత దృష్ట్యా, వారిని రాత్రి 8:30 గంటల తర్వాత పనిలో ఉంచుకోకూడదని ప్రభుత్వం ఆదేశించింది.
#Hyderabad:#Telangana #LabourDepartment grants #exemption to all #shops & #establishments across the state for #Ramzan2026.Feb 19 – Mar 20 (till 5 AM Sehri)Exemption under Sections 7(1), 12(1) & 31(1) of the TS Shops & Establishments Act.Conditions apply:• OT wages at… pic.twitter.com/NS5q3dOQcJ
— NewsMeter (@NewsMeter_In) February 18, 2026