రాష్ట్రంలో భారీ వర్షాలు..33 జిల్లాలకు నిధులు రిలీజ్

తెలంగాణలోని 33 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ఫండ్స్‌ను రిలీజ్ చేసింది

By Knakam Karthik
Published on : 26 July 2025 5:30 PM IST

Telangana, Heavy Rains, Congress Government, Emergency Funds

రాష్ట్రంలో భారీ వర్షాలు..33 జిల్లాలకు నిధులు రిలీజ్

తెలంగాణలోని 33 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ఫండ్స్‌ను రిలీజ్ చేసింది. జిల్లాకు రూ. కోటి చొప్పున 33 జిల్లాలకు రూ.33 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఎమర్జెన్సీ సేవలు, వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అలాగే, కలెక్టర్లకు అత్యవసర నిధి కేటాయిస్తామని CM రేవంత్ తెలిపారు.

కాగా భారీ వర్షాలు, వరదలను సకాలంలో ఎదుర్కోవడానికి, ముందస్తు సన్నాహాలు చేపట్టడానికి కావాల్సిన పరికరాల కొనుగోలు కోసం ఈ నిధులు కేటాయించింది. ఎయిర్ బోట్లు, లైఫ్ జాకెట్, మైక్ సెట్, రోప్, గ్యాస్ లైట్..లాంటి పరికరాల కొనుగోలు కోసం ఈ నిధులు ఉపయోగించనున్నారు.

Next Story