ఏపీలో బర్డ్‌ ఫ్లూ ప్రచారం..అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

ఏపీలో బర్డ్ ఫ్లూతో పలు ఫారాల్లో కోళ్లు మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

By Knakam Karthik  Published on  11 Feb 2025 4:23 PM IST
Telugu News, Telangana, Andrapradesh, bird flu campaign

ఏపీలో బర్డ్‌ ఫ్లూ ప్రచారం..అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

ఏపీలో బర్డ్ ఫ్లూతో పలు ఫారాల్లో కోళ్లు మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వ్యాధిపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ఫారాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని ఖమ్మం, సత్తుపల్లిలో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ కారణమని భావిస్తున్నారు.

Next Story