ఒక్క‌సారి కాదు.. భ‌రాబ‌ర్ వంద సార్లు న‌మ‌స్క‌రిస్తాను : డీహెచ్ శ్రీనివాస రావు

Telangana Director of Health Srinivasa Rao Sensational Comments. ఇటీవల ప్రగతి భవన్‌లో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభ కార్యక్రమంలో

By Medi Samrat  Published on  20 Nov 2022 12:58 PM GMT
ఒక్క‌సారి కాదు.. భ‌రాబ‌ర్ వంద సార్లు న‌మ‌స్క‌రిస్తాను : డీహెచ్ శ్రీనివాస రావు

ఇటీవల ప్రగతి భవన్‌లో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాదాభివందనం చేసిన విషయం తెలిసిందే. మారుమూల ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసి ప్రారంభించిన శుభ సందర్భం లోనే కొత్తగూడెం జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తాను పాదాభివందనం చేసానని డీహెచ్ గడల శ్రీనివాస రావు ఇప్పటికే ప్రకటించారు.

ఐతే ఈ విషయమై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో.. కొత్తగూడెం పట్టణంలో ఆదివారం జరిగిన మున్నూరు కాపు వన భోజనాల వేడుకకు హాజ‌రైన ఆయ‌న‌ స్పందించారు.. ప్రత్యేక తెలంగాణ సాధించిన జాతిపితగా.. బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పరిపాలనాదక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పితృ సమానులుగా భావిస్తానని తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ఫోటో దిగడం.. ఆయన పాదప‌ద్మాల‌ను తాకడం త‌ప్పా..? అని అడిగారు. ఒక్క‌సారి కాదు.. భ‌రాబ‌ర్ వంద సార్లు ఆయ‌న పాదప‌ద్మాల‌కు న‌మ‌స్క‌రిస్తాను అని విమ‌ర్శ‌ల‌కు బ‌దులిచ్చారు.

గిరిజన ప్రాంతం నుండి మెడిసిన్ చదివేందుకు హైద్రాబాద్ వచ్చిన సందర్భంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు.. నేటి తరానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువతకు రాకుండా చేసిన సీఎం కేసీఆర్ కు మరోమారు స‌భాముఖంగా వందనాలు తెలుపుతున్నాన‌ని ఉద్వేగంగా మాట్లాడారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథ‌కాలు అమలు చేస్తున్న ఘనత.. ఒక్క తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కు మాత్రమే దక్కిందని గడల శ్రీనివాస రావు గుర్తుచేశారు. ఆరోగ్య తెలంగాణ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న యజ్ఞంలో భాగస్వామ్యులుగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.




Next Story