బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అక్రమాల వెనుక వీరి హస్తముందని, సీఐడీ డీజీ చారుసిన్హాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి ఫిర్యాదు చేశారు.
హెచ్సీఏ అక్రమాల్లో మరికొందరి పాత్ర ఉందని, విచారణ జరిపి జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో పెద్దల అండదండలతో జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. క్రికెట్కు సంబంధం లేని రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ చేయాలని సీఐడీని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధికారులు కోరారు. హెచ్సీఏ అక్రమాల వ్యవహారంపై సీఐడీతో పాటు ఈడీకి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది.