ఢిల్లీలో ధర్నా.. కార్యకర్తలకు టీపీసీసీ పిలుపు

బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 6వ తేదీన ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు టీపీసీసీ తెలిపింది.

By అంజి
Published on : 3 Aug 2025 12:19 PM IST

Telangana, Congress, dharna, BC reservations

ఢిల్లీలో ధర్నా.. కార్యకర్తలకు టీపీసీసీ పిలుపు

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 6వ తేదీన ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు టీపీసీసీ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామని, రేపు ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరుతుందని పేర్కొంది. కార్యకర్తలు కచ్చితంగా తమ వెంట ఆధార్‌ కార్డు తెచ్చుకోవాలని సూచించింది. ఈ నెల 5న పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం, 7న రాష్ట్రపతికి వినతి సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది.

అటు ఢిల్లీలో నిర్వహించిన ఏఐసీసీ సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని అన్నారు. ఈ దేశం కోసం గాంధీజీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారని, సామాన్య కార్యక‌‌ర్తగానే రాహుల్ గాంధీ కొన‌‌సాగుతున్నారని అన్నారు. వ‌‌చ్చే ఎన్నిక‌‌ల్లో మోదీని కుర్చీ నుంచి దింపేస్తామన్న సీఎం రేవంత్‌.. బీసీల సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పోరాడతామన్నారు.

ఆగస్టు 2, శనివారం నాడు ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ కార్యకర్తలు, ప్రజలకు బలమైన పిలుపునిస్తూ, వెనుకబడిన తరగతులకు (బీసీలు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో "ఢిల్లీ కోటలను బద్దలు కొట్టాలని" కోరారు. శనివారం జరిగిన “జనహిత పాదయాత్ర” సందర్భంగా నటరాజన్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నిబద్ధతను హైలైట్ చేసి, ఆగస్టు 5 నుండి దేశ రాజధానిలో బహుళ రోజుల నిరసనను ప్రకటించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే తన హామీలలో 80 శాతం అమలు చేసిందని, ఇతర చోట్ల ప్రబలంగా ఉన్న "ద్వేషపూరిత నమూనాలకు" భిన్నంగా దేశానికి "తెలంగాణ నమూనా"ను ప్రదర్శిస్తోందని నటరాజన్ పేర్కొన్నారు.

Next Story