48 గంటల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది

తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.

By Medi Samrat  Published on  30 March 2024 9:24 AM GMT
48 గంటల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది

తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే 48 గంటల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరికీ అమ్ముడుపోరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రభుత్వం ఉండదని.. మేం కనుక గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందన్నారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తోందని అన్నారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయం వెంటాడుతూ ఉంది.. సీఎం పదవిపై పదిమంది మంత్రులు ఇప్పటికే కన్నేశారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరేవారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని .. అలాంటప్పుడు ఇప్పుడు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. విచారణల పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్-ట్యాక్స్ కింద రూ.3వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు.

Next Story