తబ్లీఘీ జమాత్‌కు సర్కార్‌ నిధులు మంజూరు.. రాజాసింగ్‌ ఫైర్‌

తబ్లిగీ జమాత్ సభకు నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు.

By అంజి  Published on  21 Dec 2023 8:00 AM GMT
Tablighi Jamaat, Telangana, Raja Singh, Telangana govt, Govt funds

తబ్లీఘీ జమాత్‌కు సర్కార్‌ నిధులు మంజూరు.. రాజాసింగ్‌ ఫైర్‌

హైదరాబాద్: తబ్లిగీ జమాత్ సభకు నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వంపై గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. అంతకుముందు, తెలంగాణ ప్రభుత్వం రాబోయే మూడు రోజుల తబ్లీఘీ జమాత్ సమ్మేళనం కోసం 2,45,93,847 రూపాయల బడ్జెట్‌ను ఆమోదించింది. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వు (GO-RT-123)లో, కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అధికారులు వివిధ శాఖలకు నిధులు మంజూరు చేశారు.

రాజా సింగ్ ఆరోపణలు గుప్పించారు

ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, కజకిస్థాన్, రష్యా, సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో నిషేధిత సంస్థను కాంగ్రెస్ ఎందుకు స్వీకరిస్తోందని రాజా సింగ్ ప్రశ్నించారు. తబ్లిఘి జమాత్ వివాదాస్పద బోధనలు ఈ దేశాల్లో నిషేధానికి దారితీశాయని రాజాసింగ్‌ చెప్పారు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని.. "కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం, అటువంటి తీవ్రవాద సిద్ధాంతాలకు స్థిరమైన మద్దతు పార్టీ ప్రాధాన్యతలు, ఉద్దేశ్యాలపై ప్రశ్నలను లేవనెత్తుతుంది" అని అన్నారు.

తెలంగాణలో తబ్లిగీ జమాత్ సమ్మేళనం

తబ్లిఘి జమాత్ మూడు రోజుల సభ జనవరి 6 నుంచి జరగనుంది. వికారాబాద్ జిల్లా పరగి మండలం న్యామత్‌నగర్‌ గ్రామంలో జరగనుంది. ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా వారు తెచ్చుకున్నారు. సభకు ముందుగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో ఈ కార్యక్రమంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయమై రాజా సింగ్, ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Next Story