తెలంగాణలో మార్చి 1 నుంచి వేసవి ప్రారంభం.!
Summer may kick in from March 1 in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పాదరసం స్థాయిలు విపరీతంగా
By అంజి Published on 18 Feb 2022 11:44 AM IST
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పాదరసం స్థాయిలు విపరీతంగా పెరగడంతో తెలంగాణ నుంచి శీతాకాలం ఎట్టకేలకు వెనక్కి తగ్గుతోంది. హైదరాబాద్లోని భారత వాతావరణ విభాగం అధికారులు శీతాకాలం ముగిసిందని, మార్చి 1 నుండి వేసవి ప్రారంభమవుతుందని తెలిపారు. గురువారం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 32.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 31-32 డిగ్రీల సెల్సియస్గా ఉండగా, రాబోయే కొద్ది వారాల్లో క్రమంగా పెరుగుదలను అంచనా వేయవచ్చు.
"ప్రస్తుతం తెలంగాణపై దక్షిణ గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. పాదరసం స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే కొద్ది వారాల్లో వేసవి కాలం క్రమంగా ప్రారంభమవుతుందని ఆశించవచ్చు."అని హైదరాబాద్ ఐఎండీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ నాగ రత్న అన్నారు. సమాచారం ప్రకారం.. చందానగర్, మలక్ పేట, మణికొండ, జగద్గిరిగుట్ట, మాదాపూర్, హఫీజ్ పేట, మెహిదీపట్నం, అడ్డగుట్ట వంటి ప్రాంతాల్లో 21-22 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది వేసవి సాధారణంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
"వేసవి వేడి తీవ్రత సాధారణ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేయబడింది. సీజన్లో చాలా వరకు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది" అని నాగ రత్న చెప్పారు. ఏప్రిల్-మే నాటికి మాత్రమే ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ మార్కును తాకే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో నగరం అనుభవించిన చల్లని వేసవి ఇది. ఈ ఏడాది కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.