వరి సాగు చేస్తే ఊరుకునేది లేదు.. సిద్దిపేట కలెక్టర్‌ వ్యాఖ్యల దుమారం.!

Siddipet collector venkatram reddy Sensational comments. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరి సాగు చేస్తే రైతు ఉరి వేసుకున్నట్లే

By అంజి  Published on  26 Oct 2021 9:14 AM GMT
వరి సాగు చేస్తే ఊరుకునేది లేదు.. సిద్దిపేట కలెక్టర్‌ వ్యాఖ్యల దుమారం.!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరి సాగు చేస్తే రైతు ఉరి వేసుకున్నట్లే అన్నట్టు వ్యాఖ్యనించారు. రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, వరిసాగు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో యాసంగి పంటలు వేసే విషయమై సమీక్ష నిర్వహించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులు, విత్తనాల, ఎరువుల డీలర్లతో చర్చించారు. కిలో వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని, వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే చర్యలు తప్పవంటూ కలెకర్ట్‌ మాట్లాడారు.

బిజినెస్‌ రద్దు చేసి షాపును మూసివేయిస్తామంటూ హెచ్చరించారు. తాను ఉన్నంత కాలం సుప్రీంకోర్టుకు వెళ్లి ఆర్డర్‌ తెచ్చిన షాపు ఓపెన్‌ కాదన్నారు. నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు, ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ అధికారులు చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాల షాపులు తెరుచుకోవన్నారు. డీలర్లు గనుక విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే సంబంధిత ఏఈవోలు, అధికారులను సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. కలెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. కలెక్టర్‌ వ్యాఖ్యలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

Next Story