ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik
Published on : 30 May 2025 10:04 AM IST

Telangana, Government Of Telangana, Fee Reimbursement, Sensational decision

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై డిగ్రీలో కనీసం 75 % హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందేందుకు అర్హత ఉండదని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో 7 సంప్రదాయ వర్సిటీల వీసీల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో డిగ్రీలో కనీసం 75 % హాజరు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేదని గతంలోనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, కానీ అది అమలు కావడం లేదని వైస్ ఛాన్స్‌లర్లు ప్రస్తావించారు. ఈసారి హాజరును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ముడిపెట్టి తప్పనిసరిగా ఈ ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొంత వరకు విద్య నాణ్యత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మూడు సంవత్సరాల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండగా వాటిని 142 కు కుదించాలని నిర్ణయించారు.

ఇకపై డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే.. అలాంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేదని వారు స్పష్టం చేశారు. ఈ నియమంపై ప్రభుత్వాలు గతంలోనే ఆదేశాలు జారీ చేశారని చెప్పుకొచ్చారు. అయితే చాలా కాలేజీల్లో దాన్ని సరిగా అమలు చేయడం లేదని ఈ సందర్భంగా వీసీలు ప్రస్తావించారు. అందుకే ఈ విద్యాసంవత్సరం నుంచి 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని కచ్చితంగా తెలియజేయాలని సూచించారు. ఈ మేకు తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు.

Next Story