నేడే రైతుల ఖాతాల్లోకి డబ్బులు!

తెలంగాణలో నేటి నుంచి 'రైతు భరోసా' డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు.

By అంజి
Published on : 16 Jun 2025 8:38 AM IST

నేడే రైతుల ఖాతాల్లోకి డబ్బులు!

తెలంగాణలో నేటి నుంచి 'రైతు భరోసా' డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. పంట సాగయ్యే ప్రతీ ఎకరానికి పెట్టుబడి సాయం రైతులకు అందుతుందని స్పష్టం చేశారు. యాసంగికి సంబంధించిన బోనస్ డబ్బులను కొద్ది రోజుల్లోనే రిలీజ్‌ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రెండు విడుతల్లో రూ.౧౨ వేల చొప్పున జమ చేయనుంది.

ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతు ను రాజు చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయిన ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తోందని, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు రూ.17000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే, తమ ప్రభుత్వం 18 నెలల్లోనే రూ. 21000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్ది తో పని చేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. నాణ్యమైన విత్తనాలు,ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గత ప్రభుత్వం వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలు పెట్టి అర్ధాంతరంగా వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగు నీటిని అందిస్తామన్నారు. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం 12 వేలు ఇస్తామని చెప్పారు.

Next Story