ఆ విష సంస్కృతిని విశ్వనగరంలో ప్రొత్సహిస్తున్నది ఎవరు.?

Revanth Reddy Fires On CM KCR. సీఎం కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టి ఏడున్నర ఏళ్లు అవుతోంది.. కేసీఆర్ అవినీతి మీద ఆధారాలతో

By Medi Samrat  Published on  15 Sep 2021 10:06 AM GMT
ఆ విష సంస్కృతిని విశ్వనగరంలో ప్రొత్సహిస్తున్నది ఎవరు.?

సీఎం కేసీఆర్ పాలన పగ్గాలు చేపట్టి ఏడున్నర ఏళ్లు అవుతోంది.. కేసీఆర్ అవినీతి మీద ఆధారాలతో సహా కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన కేంద్రం స్పందించడం లేదని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ అన్నారు. కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని బీజేపీ నేతలు బండి సంజయ్ మాట్లాడుతున్నారు.. సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా వస్తున్న నేఫ‌థ్యంలో.. కాంగ్రెస్‌ ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ లకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తే.. కేసీఆర్ అవినీతి పై ఆధారాలు అందచేస్తామ‌న్నారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ ఇలా అనేక అవకతవకలపై ఫిర్యాదు చేస్తామ‌ని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధారాలు లేవంటున్నారు.. మాకు అపాయింట్ మెంట్ ఇప్పిస్తే మేము అందజేస్తాం అన్నారు.

తెలంగాణ వ్యసనపరులకు స్వర్గదామంగా మారిందని రేవంత్ వ్యాఖ్యానించారు. విపరీతంగా మధ్యం అమ్మకాలు సాగుతున్నాయని.. బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాంలో ప్ర‌జ‌ల‌ను తాగుబోతులుగా మారుస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పాశవిక దాడులకు.. మద్యం మత్తులో చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలిందని.. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లో నేరాల లిస్ట్ లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అన్నారు. మద్యం, గంజాయి మత్తులో తెలంగాణ యువత చిక్కుకుంటోందని అన్నారు. హైదరాబాద్ సింగరేణి ఘటనపై.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నిందితుడు పట్టుబడ్డాడని చెప్పారని.. 5 రోజుల తర్వాత నిందితుడు దొరకలేదని పోలీసులు బహిరంగ ప్రకటన చేశారని.. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఉందా.. సీఎం కేసీఆర్ ను అడుగుతున్నామ‌న్నారు.

ఆరేళ్ల పసిబాలలను చెరిపి చంపేసే విష సంస్కృతిని విశ్వనగరంలో ప్రొత్సహిస్తున్నది ఎవరు.? అని ప్ర‌శ్నించారు. సినీనటులు డ్రగ్స్ వాడుతున్నారని గతంలో ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి.. విచారణ అధికారి అకున్ సభర్వాల్ ను పక్కకు తప్పించారు. డ్రగ్స్ కేసులో నేను కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కేసు వేశాం. ఈడీ విచారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కోర్టు పేర్కొంది. డ్రగ్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్ర‌శ్నించారు.

బెంగళూరు, ఢిల్లీ, మహారాష్ట్రలో తీగ లాగితే హైదరాబాద్ లింక్ లు బయటపడుతున్నాయని.. హైదరాబాద్ లో సింగరేణి కాలనీ.. హోంమంత్రి మహమూద్ అలీ ఇంటికి కూతవేటు దూరంలో ఉందని.. సింగరేణి లో గంజాయి, గుడుంబా విచ్చలవిడిగా సాగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు. సింగరేణి కాలనీని దత్తత తీసుకున్న కేటీఆర్.. ఘోర ఘటన జరిగినా ఎందుకు పట్టించుకోవడం లేదు.. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే సీఎం ఎందుకు సమీక్ష చేయడం లేదని రేవంత్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.


Next Story