అంద‌రి భాగోతం బయట‌పెడుతా : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fires On CM KCR. ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జ‌రిగింద‌ని.. కేసీఆర్ బినామీల కోసమే

By Medi Samrat  Published on  17 July 2021 11:50 AM GMT
అంద‌రి భాగోతం బయట‌పెడుతా : రేవంత్ రెడ్డి

ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జ‌రిగింద‌ని.. సీఎం కేసీఆర్ బినామీల కోసమే భూముల అమ్మకాలు చేప‌ట్టార‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ అమ్మిన భూములు కోకాపేట గ్రామంలో ఉన్నాయి. గతంలో కూడా రియల్ భూమి పెరినట్లు ప్రచారం చేశారు.. రియల్ భూమ్ కోసమే అమ్ముతున్నట్లు ఉందని అన్నారు.


ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ లో స్మశానాల కోసం కూడా స్థలం ఉండదని రేవంత్ ఫైర్ అయ్యారు. ఈ- ఆక్షన్ లో కేసీఆర్ బినామీ కంపెనీలు భూములు దక్కించుకున్నాయని ఆరోపించారు. రూ. 3 వేల కోట్లు ధ‌ర‌ రావాల్సిన భూములను.. రూ. 2వేల కోట్లకే పరిమితం చేశారని మండిప‌డ్డారు. సోమేశ్ కుమార్, కేటీఆర్ లంచాలు తీసుకోని భూముల గోల్ మాల్ చేశారని.. 50 ఎకరాలు ఉన్న భూమి.. ఎకరానికో రేటు ఎలా ఉంటుందని ప్ర‌శ్నించారు.

ఒకే గ్రామంలో ఉన్న ఒక్క ఎకరాకు 60 కోట్లు.. మిగిలిన 48 ఎకరాలు 30 నుంచి 40 కోట్లకు ఎలా ధర పలుకుతుందని అన్నారు. సిద్దిపేట కలెక్టర్ కూడా భూములు కొన్నార‌ని.. మిగతా వాళ్ళు ఎవ్వరూ టెండర్లు వేయకుండా ఫోన్ చేసి బెదిరించారని విమ‌ర్శించారు. టెండర్లు వేస్తే ప్రభుత్వ అనుమతులు ఇవ్వమని హెచ్చరించారని ఆరోపించారు. టీఆర్ఎస్, కేసీఆర్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే భూములు అప్పజెప్పారని రేవంత్ అన్నారు.

కోకాపేటలో రూ. 50 కోట్లకు తక్కువ ధర లేదని.. అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వబోతోందని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల లూటీ జరిగిందని ఫైర్ అయ్యారు. గతంలో లిక్కర్ మాఫియా లెక్క.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు తెరలేపిందని ఆరోపించారు. రూ.60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమినంతా మళ్ళీ టెండర్లు పిలవాలని రేవంత్ డిమాండ్ చేశారు.

స్విచ్ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లు పిలువాలని కోరారు. త్వ‌ర‌లోనే అంద‌రి భాగోతం బయట‌పెడుతాన‌ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ దోపిడీ పరాకాష్టకు చేరుకుందని ఫైర్ అయ్యారు. తరాల నుంచి వస్తున్న భూములను అమ్మే హక్కు కేసీఆర్ కు లేదని అన్నారు. ఈ విష‌య‌మై నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కేంద్ర హోంమంత్రి, ప్రధానికి ఫిర్యాదు చేస్తాన‌ని అన్నారు. కిషన్ రెడ్డి కి కూడా నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తాన‌ని.. నేను ఇచ్చే ఫిర్యాదు పై కేంద్రం- బీజేపీ విచారణకు అదేశిస్తుందో.. లేదో చూడాల‌న్నారు. టీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందం ఏంటో తెలుస్తుందని అన్నారు. భూ ఆక్రమాల‌పై పార్లమెంట్ లో మాట్లాడుతాన‌ని రేవంత్ రెడ్డి అన్నారు.


Next Story