బీజేపీకి ఫండింగ్ చేస్తుంది కేసీఆరే : రేవంత్ రెడ్డి

Revanth Reddy Fire On CM KCR. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు

By Medi Samrat  Published on  22 March 2022 10:11 AM GMT
బీజేపీకి ఫండింగ్ చేస్తుంది కేసీఆరే : రేవంత్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో, సింగరేణి కోల్ మైన్స్ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆయ‌న అన్నారు. సింగరేణి కోల్ మైన్స్ కి సంబంధించి ప్రధానికి ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని రేవంత్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియ జరుగుతున్నా.. సింగరేణి సీఎండీ శ్రీధర్ పై ఎందుకు కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ప్ర‌శ్నించారు. సింగరేణి కుంభకోణంపై దర్యాప్తు సంస్థలకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అన్నారు.

ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి కోల్ నిభంధనలు ఉల్లంఘించి గనులు కేటాయిస్తున్నారని.. మోదీ ప్రభుత్వం కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తుంద‌ని ఆరోపించారు. 50 వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని.. పారదర్శకంగా కోల్ మైన్ టెండర్లు ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు బీజేపీకి ఫండింగ్ చేస్తుంది కేసీఆరే న‌ని ఆరోపించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను బలహీన పరచడానికి ఒవైసీ, కేసీఆర్ తిరుగుతున్నారని అన్నారు. సింగరేణి కోల్ మైన్స్ అవినీతిపై కోర్టును ఆశ్రయిస్తామ‌ని.. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటేన‌ని అన్నారు. సింగరేణి అంశంపై ప్రధాని వెంటనే సీబీఐ విచారణకు అదేశించాలి లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు మా ఫిర్యాదులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.











Next Story