కేసీఆర్‌ను రెండు చోట్లా ఓడిస్తారు : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సవాల్ ను కేసీఆర్ స్వీకరించకుండా ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  21 Aug 2023 11:37 AM GMT
కేసీఆర్‌ను రెండు చోట్లా ఓడిస్తారు : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సవాల్ ను కేసీఆర్ స్వీకరించకుండా ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 12.03 గంటలకు బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ విడుదల అని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తంలో లిక్కర్ షాప్స్ డ్రా తీశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ విడుదల చేసిన లిస్ట్ చూశాక రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అర్ధమైందన్నారు. 2/3 మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటే ఆయన స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నట్లేన‌న్నారు.

కేసీఆర్ ను ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడిస్తారని అన్నారు. కేసీఆర్ పారిపోవాలనుకుంటే సిద్దిపేట ఉంది.. సిరిసిల్ల ఉంది.. కానీ ఒక మైనారిటీ నేత ఉన్న కామారెడ్డికి వెళ్లడం.. మైనారిటీలను అవమానించడమేన‌న్నారు. ఈ విషయాన్ని మైనారిటీలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే.. ఆయన గొంతులో భయం మొదలైందన్నారు. లక్ష రుణమాఫీ అని చెప్పి 99,999 రుణమాఫీ అని లక్కీ నంబర్ చూపారని విమ‌ర్శించారు.

Next Story