కవిత బీసీ కాకున్నా పోరాటం చేస్తున్నారు అండగా నిలవాలి: ఆర్.కృష్ణయ్య

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకున్నా బీసీల కోసం పోరాడుతున్నారు..అని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు.

By Knakam Karthik
Published on : 22 Jun 2025 3:35 PM IST

Telangana, Brs Mlc Kavitha, R.Krishnaiah, Bc Reservations, Congress, bjp

కవిత బీసీ కాకున్నా పోరాటం చేస్తున్నారు అండగా నిలవాలి: ఆర్.కృష్ణయ్య

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకున్నా బీసీల కోసం పోరాడుతున్నారు..అని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఆర్.కృష్ణయ్య నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆయన్ను కలిశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలోనే జులై 17వ తేదీన నిర్వహించ తలపెట్టిన రైల్ రోకోకు మద్దతు ఇస్తున్నట్లు కృష్ణయ్య పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కోసం అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. కవితకు బీసీలు అండగా నిలవాలి. బీసీలు పోరాటం చేసే చారిత్రక సందర్భం వచ్చింది. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోంది. బీసీలు కమిట్మెంట్‌తో పోరాటం చేయకపోతే ఇప్పుడు ఉన్న బీసీ రిజర్వేషన్లు తగ్గుతాయి. కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాడుతున్నారు. ప్రజా ఉద్యమం చేయకపోతే బీసీల హక్కులు నెరవేరవు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కోసం ఎవరు ఉద్యమం చేసినా బీసీలు మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వం పులి మీద స్వారీ చేస్తుంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. బీసీల రిజర్వేషన్లు కోసం పోరాటం చేసే వారిని ఎవరూ తప్పుపట్టవద్దు. బీసీలు ఉద్యమం చేస్తేనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. జూలై 17న జరిగే జాగృతి రైల్ రోకోకు కచ్చితంగా మద్దతు ఇస్తాం. కవిత ఎవరి కోసం పోరాటం చేస్తుంది... బీసీల కోసమే కదా.?..అని ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు.

Next Story