తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి: ప్రధాని

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆదిలాబాద్‌ నుంచి రూ.56వేల కోట్లు, సంగారెడ్డి నుంచి రూ.7వేల కోట్ల పనులు ప్రారంభించామన్నారు.

By అంజి  Published on  5 March 2024 6:45 AM GMT
PM Modi, Telangana, Sangareddy, Hyderabad

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి: ప్రధాని

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆదిలాబాద్‌ నుంచి రూ.56వేల కోట్లు, సంగారెడ్డి నుంచి రూ.7వేల కోట్ల పనులు ప్రారంభించామన్నారు. బేగంపేటలో సివిల్‌ ఏవియేషన్ రీసెర్చ్‌ కేంద్రం ఏర్పాటు చేశామని, దేశంలోనే మొదటి సివిల్‌ ఏవియేషన్ రీసెర్చ్‌ కేంద్రం ఇది అని తెలిపారు. స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుందని, దీని ద్వారా హైదరాబాద్‌, తెలంగాణకు గుర్తింపు వస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని సంగారెడ్డిలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.7,200 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులు రోడ్డు, రైలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి బహుళ కీలక రంగాలకు సంబంధించినవి. పౌర విమానయాన రంగంలో పరిశోధన , అభివృద్ధి (ఆర్ అండ్ డి) కార్యకలాపాలను అప్‌గ్రేడ్ చేయడానికి, మెరుగుపరచడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) కేంద్రాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు.

రూ. 350 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించబడిన ఈ అత్యాధునిక సదుపాయం 5-స్టార్-గృహ రేటింగ్ , ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) నిబంధనలకు అనుగుణంగా ఉంది. మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. NH-65లోని పూణె-హైదరాబాద్ సెక్షన్ 29 కి.మీ పొడవునా ఆరు లేనింగ్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం వంటి తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు ఈ ప్రాజెక్ట్ మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే స‌న‌త్‌న‌గ‌ర్ - మౌలాలీ రైలు మార్గం డ‌బ్లింగ్, విద్యుదీకరణతో పాటు ఆరు కొత్త స్టేషన్‌ల భవనాలను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

ఘట్‌కేసర్-లింగంపల్లి నుంచి మౌలాలీ-సనత్‌నగర్ మీదుగా ప్రారంభమైన MMTS (మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్) రైలు సర్వీసును కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు సర్వీస్ మొదటిసారిగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగర ప్రాంతాలలో ప్రసిద్ధ సబర్బన్ రైలు సేవను కొత్త ప్రాంతాలకు విస్తరించింది. అలాగే ఇండియన్ ఆయిల్ పారాదీప్-హైదరాబాద్ ప్రొడక్ట్ పైప్‌లైన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. 4.5 MMTPA సామర్థ్యంతో 1,212 కి.మీ ఉత్పత్తి పైప్‌లైన్ ఒడిశా (329 కి.మీ), ఆంధ్రప్రదేశ్ (723 కి.మీ, తెలంగాణ (160 కి.మీ) రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.

పైప్‌లైన్ పారదీప్ రిఫైనరీ నుండి విశాఖపట్నం, అచ్యుతాపురం, విజయవాడ (ఆంధ్రప్రదేశ్‌లోని) డెలివరీ స్టేషన్‌లకు, హైదరాబాద్ (తెలంగాణలోని) సమీపంలోని మల్కాపూర్‌లకు పెట్రోలియం ఉత్పత్తులను సురక్షితంగా, పొదుపుగా రవాణా చేస్తుంది.

Next Story