అమిత్ షాతో ముగిసిన పవన్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ కీల‌క నేత‌ అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

By Medi Samrat  Published on  25 Oct 2023 2:43 PM GMT
అమిత్ షాతో ముగిసిన పవన్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ కీల‌క నేత‌ అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ ముగిసింది. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ముగ్గురు నేతలు చర్చించిన‌ట్లు తెలుస్తుంది. భేటీ అనంత‌రం జనసేన, తెలంగాణ బీజేపీ నేతలు తిరుగుప‌య‌న‌మ‌య్యారు. అయితే.. అమిత్ షాను కలిసిన తరువాత పవన్, కిషన్ రెడ్డి ఇరువురూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. భేటీకి ముందు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణలో అన్ని పార్టీలు అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తున్నాయి. బీజేపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అగ్రనేతలతో చర్చలు జరిపిన‌ట్లు తెలుస్తుంది.

Next Story