బీజేపీకి షాక్‌.. టీఆర్ఎస్‌లో భారీగా చేరిక‌లు

Over 250 BJP workers join TRS in Patancheru. ఆదివారం పటాన్‌చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ సీనియర్‌ నేత

By Medi Samrat  Published on  14 Aug 2022 10:46 AM GMT
బీజేపీకి షాక్‌.. టీఆర్ఎస్‌లో భారీగా చేరిక‌లు

ఆదివారం పటాన్‌చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ సీనియర్‌ నేత సునీల్‌ ఆధ్వర్యంలో 250 మందికి పైగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరారు. మహిపాల్‌రెడ్డి వారికి టీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు కాలుష్యానికి పేరుగాంచిన పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధికి కొత్త చిరునామాగా మారిందని అన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో గత ఎనిమిదేళ్లలో పటాన్‌చెరు ప్రాంతం సంపూర్ణంగా పరివర్తన చెందిందన్నారు. జిన్నారం మండలం శివనగర్‌లో ఎల్‌ఈడీ పార్కును ప్రారంభించడంతో పాటు పటాన్‌చెరు సమీపంలోని ఉస్మాన్ నగర్‌లో ఐటీ హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన మెడికల్‌ డివైజెస్‌ పార్కుతో స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story