రాష్ట్రంలో వాటర్ ఫాల్స్ సందర్శనకు నో పర్మిషన్..అలా వెళ్తే కేసు

వరదల కారణంగా రాష్ట్రంలోని వాటర్ ఫాల్స్ సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ ప్రకటన విడుదల చేసింది.

By Knakam Karthik
Published on : 24 July 2025 8:35 AM IST

Telangana, Heavy Rains, Mulugu District, bogatha Water Falls, Tourists

రాష్ట్రంలో వాటర్ ఫాల్స్ సందర్శనకు నో పర్మిషన్..అలా వెళ్తే కేసు

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. అయితే వరదల కారణంగా రాష్ట్రంలోని వాటర్ ఫాల్స్ సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు నిండిపోయాయి. ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతం అయిన బొగత జలపాతంకు వరద పోటెత్తింది. ప్రస్తుతం బొగత వద్ద భీకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ఈ తెల్లవారుజామున ప్రకటన విడుదల చేశారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ముత్యంధార, కొంగర, మామిడిలోద్ది, కృష్ణపురం పర్మినెంట్‌గా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులు ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.

Next Story