ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ వివరాలను తెలియజేశారు. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను పరిచయం చేశారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులో పార్టీ జెండా ఉంది. జెండా మధ్యలో పిడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక చక్రం, వరి కంకులు ఉన్నాయి. జెండా పైభాగంలో ఆత్మగౌరవం, అధికారం, వాటా నినాదాలను ఉంచారు.
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో బాగా ఎదిగారు. ఒకప్పుడు మీడియా లోనూ, సోషల్ మీడియాలోనూ ప్రజా సమస్యల గురించి గళం వినిపించిన మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు.