నన్ను సంప్రదించకుంటే ఎలా.? : ఎమ్మెల్సీ కవిత గుస్సా

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది.

By Medi Samrat
Published on : 28 May 2025 8:12 PM IST

నన్ను సంప్రదించకుంటే ఎలా.? : ఎమ్మెల్సీ కవిత గుస్సా

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, ఒక దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. "కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా?? శాడిజమా?" అంటూ కవిత ప్రశ్నించారు.

తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా కవిత పలు నిర్ణయాలు తీసుకున్నారు. జాగృతికి అనుబంధ సంఘాలను వరుసగా ప్రకటించడం, సంస్థ కార్యకలాపాలను విస్తరించడం వంటి పరిణామాలతో ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. తన తండ్రి కేసీఆర్‌కు ఆమె ఒక లేఖ రాయడం సంచలనంగా మారడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన కవిత తన కొత్త పార్టీని ప్రకటిస్తారంటూ వార్తలు రాగా.. ఈ కథనాలన్నింటినీ కవిత ఖండించారు.

Next Story