సింగ‌రేణిని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలని చూస్తుంది : జీవన్ రెడ్డి

సింగరేణి వేతన బకాయిలు 23 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు

By Medi Samrat  Published on  5 Sep 2023 9:24 AM GMT
సింగ‌రేణిని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలని చూస్తుంది : జీవన్ రెడ్డి

సింగరేణి వేతన బకాయిలు 23 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కోల్ ఇండియా ఇప్పటికే ఇందుకు సంబంధించిన జీవో కూడా ఇచ్చిందని తెలిపారు. 2200 కోట్ల లాభంలో కార్మికుల వాటా 750 కోట్లు వారికీ రావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగ‌రేణిని తన ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలని చూస్తుందన్నారు. జెన్ కో, ట్రాన్స్ కో నుంచి సింగరేణికి 20 వేల కోట్లు బకాయి ఉందని తెలిపారు.

తెలంగాణ ఏర్పడినపుడు 3,540 బ్యాంకు బాండ్స్ తో లాభాల్లో ఉండగా.. ఇప్పుడు బకాయిలు రాక కష్టాల్లో ఉన్నాయ‌ని అన్నారు. అప్పుడు 65 వేల కార్మికులు ఉంటే.. ఇప్పుడు 42 వేలకు పడిపోయిందన్నారు. కారణం బొగ్గు తొవ్వే పని కాంట్రాక్టు ఇవ్వటంతో కార్మికులు సంఖ్య తగ్గిందని వివ‌రించారు. కేంద్రంతో ఉమ్మడిగా పథకం పన్ని.. కార్మికుల శ్రమని వాడుకుంటున్నారని ఆరోపించారు.

33 జిల్లాలో ప్రభుత్వ ఖర్చుల‌తో మెడికల్ కాలేజీలు అన్న ప్రభుత్వం.. రామగుండంలో మాత్రం సింగరేణి నుంచి ఫండ్ తీసుకుంటుందని అన్నారు. సింగరేణి కార్మికుల పిల్లలకి మెడికల్ కాలేజీల‌లో కనీసం 25% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే కేవలం 7% ఇస్తాము అనటం ఏంటని ప్ర‌శ్నించారు. అప్పట్లో సింగరేణికి 400 కోట్లు కేటాయించి.. లాభాలా బాట పట్టేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అని వివ‌రించారు.

కాంగ్రెస్ సీడ‌బ్ల్యూసీ మీటింగ్ కోసం 3 రోజుల క్రితమే అప్లై చేసి పరేడ్ గ్రౌండ్ ని కూడా చూసి వచ్చామ‌ని తెలిపారు. ఇప్పుడు బీజేపీ అదే రోజు అక్కడే హైదరాబాద్ విమోచన దినం చేస్తామనడం ఏంటి అని ప్ర‌శ్నించారు. వాళ్ళకి అది తప్ప వేరే గ్రౌండ్ దొరకలేదా అని మండిప‌డ్డారు. ఫస్ట్ కాంగ్రెస్ అనుమతి కోరింది కాబట్టి మాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇలాంటి కుంచిత తాత్వాన్ని మానుకోవాలని అన్నారు.

Next Story