హైదరాబాద్లో ఆషాఢ మాస బోనాలు..మంత్రి కీలక ఆదేశాలు
హైదరాబాద్లో ఆషాడమాస బోనాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik
హైదరాబాద్లో ఆషాఢ మాస బోనాలు..మంత్రి కీలక ఆదేశాలు
హైదరాబాద్లో ఆషాడమాస బోనాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాలు సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేదానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలి. జూన్ 26 తో తొలి బోనం గోల్కొండ లో ప్రారంభం అవుతుంది. బల్కంపేట , ఉజ్జయిని మహంకాళి ,లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి. రంగం, తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా రూ. 20 కోట్లు కేటాయించడం జరిగింది. దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ & ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకొని పండగ లకు ముందే పూర్తి చేయాలి. అధికారులు ఉద్యోగం లాగ కాకుండా సేవ చేస్తున్నామనే దృక్పథంతో పని చేయాలి..అని మంత్రి పొన్నం సూచించారు.
అలాగే ఉజ్జయిని మహంకాళి ,లాల్ దర్వాజ, బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయండి. సాంస్కృతిక కార్యక్రమాలు , ఐ అండ్ పి ఆర్, బోనాల పై కర్టెన్ రైజర్ చూడాలి. హైదరాబాద్ చారిత్రాత్మకంగా ఉండే బోనాలు ఘనంగా జరుపుకోవాలి. జీహెచ్ఎంసీ శానిటేషన్ , రెవెన్యూ భారీకెడ్లు, లైటింగ్ ,వాటర్ ఫెసిలిటీ ,కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షణ చేయాలి. పోలీసులు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల విభాగాలతో సమన్వయం చేసుకోవాలి. అధికారులు ఎక్కడా లోపం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదంతో అంత శుభం జరగాలి. కార్యక్రమం అంతా విజయవంతం జరగాలి. అందరూ అధికారులు బాధ్యతగా నిర్వహిస్తే బోనాల ద్వారా హైదరాబాద్ గౌరవం రెట్టింపు అవుతుంది. బోనాల పండుగ నృత్యాలు ,వేడుక చేసుకుంటూ హైదరాబాద్ లో జరిగే ఈ వేడుక కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అందరూ పని చేయాలి..అని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.