నాకు ఇచ్చిన మంత్రి పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.
నేను చచ్చే వరకూ ప్రజల్లో ఉండి, ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు. మక్తల్ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేశారన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నేను మంత్రి కావడానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలందరూ సపోర్ట్ చేశారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.