యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ఫౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు సున్నితమైన అంశం, ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎలాంటి అవాంతరాలు కలుగకుండా చూసుకోవాలి. రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ఉధృతంగా ఉంటాయి.ఈ సమయంలో అధికారం యంత్రాంగ అప్రమత్తంగా ఉండాలి. గోడౌన్లు అందుబాటులో లేని చోట.. సమీపంలో అందుబాటులో ఉన్న మిల్లులకు ధాన్యం తరలించాలి. 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నాం. కొనుగోళ్లు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. సన్న ధాన్యానికి సత్వరమే బోనస్ చెల్లింపులు చేస్తాం..అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. 2021-22 పోల్చి చూస్తే ఈ రబీ సీజన్లో అదనంగా 1,772 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం...అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.