చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనుంది

By Knakam Karthik
Published on : 4 Jun 2025 3:38 PM IST

Telangana, Hyderabad News, Minister Ponnam Prabhakar, Congress Government

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీపై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్‌కు పలు సూచనలు చేశారు. ఈ నెల 6 వ తేదీ నుండే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

కాగా చేప ప్రసాదం కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఫిషరీస్ కార్పొరేషన్ సిద్ధం చేసినట్లు తెలిపారు. చేప ప్రసాదం పంపిణీలో బారీకేడ్లు, క్యూ లైన్‌లో ఇబ్బందులు, భద్రతా ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేప ప్రసాదం వచ్చే వారి కోసం త్రాగునీరు సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇక చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం పలు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతిని కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో వారికి కూడా కావాల్సిన ఏర్పాట్లను చేయాలని అధికారులకు మంత్రి పొన్నం సూచించారు.

Next Story