రప్పా..రప్పా అంటూ ధర్నాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు..అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ధర్నాలో 2028లో రప్పా..రప్పా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. రప్పా.. రప్పా.. అంటూ ధర్నాలతో రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఫ్యాక్షనిజాన్ని తెరమీదకు తెద్దామనుకుంటున్నారా? ఏంటి నీ అసలు ఉద్దేశం? రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నందుకా రప్పా రప్పా..? రాష్ట్రంలో శాంతి భద్రతలపై రాష్ట్ర ప్రభుత్వానికి శిత్తశుద్ధి ఉంది.. ఎవరైనా విఘాతం కలిగిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు.. గతంలో చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు...అని మంత్రి పొంగులేటి వార్నింగ్ ఇచ్చారు.
కాగా సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో నిర్వహించిన రైతు ధర్నాలో.. 2028 లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ కొంత మంది కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది.