సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్నారు.

By Medi Samrat
Published on : 6 Jun 2025 5:00 PM IST

సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రూ.25 వేల కోట్లు కమీషన్ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పీఎస్‌లో ఆత్రం సుగుణ పరువునష్టం కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాల్సిందిగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా, తీర్పు కేటీఆర్‌కు అనుకూలంగా ఇచ్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్‌కు అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Next Story