ఐసీయూ బస్సులు.. దేశంలోనే తెలంగాణ ప్రథమం
KTR launches mobile ICU buses in Telangana. కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని పరిస్థితి
By Medi Samrat
కోవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందని తెలిపారు కేటీఆర్. తొలి విడతగా రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించామని.. త్వరలోనే జిల్లాకు రెండు చొప్పున బస్సులను కేటాయిస్తామన్నారు. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం ఇదే తొలిసారని చెప్పారు. కోవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. మొబైల్ ఐసీయూ బస్సులో పేషెంట్ల కోసం 10 పడకలు,వైద్య సేవల కోసం ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు,టెక్నీషియన్స్,సీసీటీవీ,లైవ్ ఇంటరాక్షన్ వీడియో, ఇతరత్రా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. చాలామంది పేషెంట్లు జిల్లా కేంద్రాలు లేదా నగరాల్లోని ఆస్పత్రులకు చేరుకునే లోపే ఆరోగ్య పరిస్థితి విషమించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ మొబైల్ ఐసీయూల ద్వారా అలాంటి పేషెంట్లకు బస్సులో చికిత్స అందిస్తూనే ఆస్పత్రులకు చేర్చవచ్చని.. ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారు.